Bharath Ane Nenu: 100 మంది డ్యాన్సర్లు, 1000 మంది జూ.ఆర్టిస్టులతో 'భరత్ అనే నేను' పాట చిత్రీకరణ

  • మహేశ్ బాబు లుక్ కనువిందు చేస్తోందన్న నిర్మాత దానయ్య
  • ఈ నెల 25 నుంచి స్పెయిన్‌లో షెడ్యూల్
  • ఏప్రిల్ 20న ప్రపంచ వ్యాప్తంగా సినిమా విడుదల

ప్రేక్షకులకు తమ కొత్త సినిమాలోని మహేశ్ బాబు లుక్ కనువిందు చేస్తోందని నిర్మాత డీవీవీ దానయ్య అన్నారు. ఉగాది సందర్భంగా ఈ రోజు 'భరత్ అనే నేను' సినిమాలోంచి మహేశ్ బాబు 'పంచెకట్టు పోస్టర్' విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా దానయ్య మాట్లాడుతూ... ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి రాజు సుందరం నేతృత్వంలో ఓ పాట చిత్రీకరణ జరుగుతోందని తెలిపారు.

భారీ టెంపుల్ సెట్‌లో 100 మంది డ్యాన్సర్లు, 1000 మందికి పైగా జూనియర్ ఆర్టిస్టులతో చాలా గ్రాండ్ లెవల్‌లో ఈ పాటను చిత్రీకరిస్తున్నారని చెప్పారు. ఈ నెల 25 నుంచి స్పెయిన్‌లో షెడ్యూల్ ఉంటుందని, అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఏప్రిల్ 20న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేస్తామని అన్నారు. కాగా, ఈ సినిమాను మహేశ్ బాబు, కైరా అద్వానీ, ప్రకాశ్ రాజ్ ప్రధానపాత్రల్లో దర్శకుడు కొరటాల శివ రూపొందిస్తున్నారు.

More Telugu News