Pawan Kalyan: ఉద్దండరాయునిపాలెంకు బయలుదేరిన పవన్ కల్యాణ్... వేచి చూస్తున్న రైతులు!

  • రాజధాని ప్రాంత రైతులతో భేటీ
  • వారి సమస్యలు తెలుసుకునేందుకే
  • గతంలోనూ ఉద్దండరాయునిపాలెంలో పర్యటించిన పవన్

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మరికాసేపట్లో ఉద్దండరాయునిపాలెంకు వెళ్లనున్నారు. ప్రస్తుతం విజయవాడలో ఉన్న ఆయన, ఈ ఉదయం ఉగాది పండగను జరుపుకున్నారు. ఆపై అమరావతి పరిధిలో ప్రభుత్వానికి భూములు ఇచ్చిన ప్రధాన గ్రామాల్లో ఒకటైన ఉద్దండరాయునిపాలెంలో రైతులను కలిసేందుకు బయలుదేరారు.

మరోపక్క, ఇప్పటికే గ్రామంలోని రైతులంతా పవన్ రాక కోసం ఎదురు చూస్తున్నారు. గతంలోనూ పవన్ ఓ మారు ఇదే గ్రామంలో పర్యటించిన సంగతి తెలిసిందే. రాజధాని ప్రాంత రైతుల సమస్యలను గురించి తెలుసుకునేందుకే తాను ఈ పర్యటనకు నిర్ణయించానని ఉద్దండరాయునిపాలెం బయలుదేరే ముందు పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.

More Telugu News