bihar: బీహార్‌లో వంతెనపై నుంచి పడిపోయిన బస్సు.. 10 మంది మృతి

  • మరికొందరికి గాయాలు
  • కొనసాగుతోన్న సహాయక చర్యలు
  • మృతుల సంఖ్య పెరిగే అవకాశం

ప్రయాణికులతో వెళుతోన్న ఓ బస్సు ప్రమాదవశాత్తూ వంతెన మీద నుంచి పడిపోయిన ఘటన బీహార్‌ సీతారామర్హి జిల్లాలోని రున్ని సైద్‌పూర్‌ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో పది మంది ప్రాణాలు కోల్పోగా, కొందరికి తీవ్రగాయాలయ్యాయి. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, రెస్క్యూ టీమ్ సహాయక చర్యలు ప్రారంభించారు. గాయాలపాలయిన వారిని దగ్గరలోని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. బస్సు ఒక్కసారిగా అదుపుతప్పడంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. 

More Telugu News