ram madhav: ఇక మా ప్ర‌శ్న‌ల‌కు చంద్ర‌బాబు స‌మాధానాలు చెప్పాలి!: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధ‌వ్

  • ఏపీ అభివృద్ధి అన్ని పార్టీల కన్నా ఎక్కువగా కట్టుబడి ఉన్నాం
  • ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తూనే ఉంది
  • ఇప్పటివరకు చంద్రబాబు మాకు ప్రశ్నలు వేశారు

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో పాటు టీడీపీ నేతలు, ఇతర పార్టీల నేతలు ఎంతగా కట్టుబడి ఉన్నారో తాము అంతకంటే ఎక్కువగా కట్టుబడి ఉన్నామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి  రామ్ మాధవ్ అన్నారు. భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాతో ఢిల్లీలో ఈ రోజు ఏపీ బీజేపీ నేతలు భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ భేటీ ముగిసిన తరువాత రామ్ మాధవ్ మీడియాతో మాట్లాడుతూ.. నాలుగేళ్లుగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తూనే ఉందని అన్నారు. ఏపీలో సెంటిమెంట్ ను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని అన్నారు.

ఎన్డీఏ నుంచి వైదొలగడం ద్వారా, కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టడం ద్వారా టీడీపీ తనంతట తానుగా తమకు వ్యతిరేకంగా నిలబడిందని రామ్ మాధవ్‌ అన్నారు. టీడీపీ నేతలు లేవనెత్తిన ప్రశ్నలకు రాబోయే రోజుల్లో తాము సమాధానాలు చెబుతామని అన్నారు. ఇప్పటివరకు చంద్రబాబు తమకు ప్రశ్నలు వేశారని, ఇకపై తాము చంద్రబాబు నాయుడిని ప్రశ్నిస్తామని వాటన్నింటికీ ఆయన సమాధానాలు చెప్పాల్సి ఉంటుందని అన్నారు.

More Telugu News