kalyan ram: 'ఎమ్మెల్యే' ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోనే

  • కల్యాణ్ రామ్ తాజా చిత్రంగా 'ఎమ్మెల్యే '
  • కథానాయికగా కాజల్ 
  • ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు    

కల్యాణ్ రామ్ హీరోగా 'ఎమ్మెల్యే' సినిమా రూపొందింది. ఉపేంద్రమాధవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఈ నెల 23వ తేదీన విడుదల చేయనున్నారు. కల్యాణ్ రామ్ న్యూ లుక్ తో కనిపించనున్న ఈ సినిమాలో ఆయన సరసన కథానాయికగా కాజల్ నటించింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ రోజున కర్నూల్ లో భారీ స్థాయిలో నిర్వహించాలనుకున్నారు.

కానీ అందుకు పరిస్థితులు అనుకూలించకపోవడంతో, ఈ నెల 21వ తేదీన హైదరాబాద్ లోనే జరపాలనే నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా రానున్నాడనే టాక్ వినిపిస్తోంది. మణిశర్మ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెబుతున్నారు. ఈ సినిమా పోస్టర్స్ కి .. టీజర్ కి .. ఆడియోకి వచ్చిన రెస్పాన్స్ వలన , ఈ సారి కల్యాణ్ రామ్ కి హిట్ పడటం ఖాయమనేది యూనిట్ సభ్యుల మాట.        

More Telugu News