pv sindhu: ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ లో సత్తా చూపిస్తున్న పీవీ సింధు... జపాన్ కు చెందిన ఒకుహరాపై విజయంతో సెమీస్ కు

  • క్వార్టర్స్ లో హోరాహోరీ పోరు
  • తొలి గేమ్ లో వెనుకబడినా తర్వాతి రెండు గేముల్లో పోరాట పటిమ
  • సెమీ ఫైనల్స్ కు చేరుకోవడం తొలిసారి

బ్యాడ్మింటన్ తార, తెలుగమ్మాయి పీవీ సింధు ఆల్ ఇంగ్లాడ్ ఓపెన్ లో తన సత్తా చాటుతోంది. మహిళల సింగిల్స్ విభాగంలో నిన్న జరిగిన మ్యాచ్ లో అద్భుత ప్రదర్శనతో జపాన్ కు చెందిన సెవెన్త్ సీడ్ నోజోమి ఒకుహరాపై ఘన విజయం సాధించి సెమీ ఫైనల్స్ కు దూసుకెళ్లింది.

క్వార్టర్స్ మ్యాచ్ లో తొలి గేమ్ లో వెనుకబడిన సింధు ఆ తర్వాత పుంజుకుని వరుసగా రెండు గేముల్లోనూ ఒకుహరాను కోలుకోకుండా చేసి 20-22, 21-18, 21-18 తేడాతో విజయం కైవసం చేసుకుంది. గంటన్నర పాటు జరిగిన మ్యాచ్ లో శారీరక సామర్థ్యం కీలకపాత్ర పోషిస్తుందని తెలిసిందే. ఈ గెలుపుతో సింధు ప్రపంచంలో ఆరో స్థానానికి చేరుకుంది. గతంలో ఐదు పర్యాయాలు కూడా ఆల్ ఇంగ్లాండ్ లో సింధు క్వార్టర్స్ నుంచే వెనుతిరగగా, సెమీఫైనల్స్ కు చేరుకోవడం మొదటిసారి.

More Telugu News