TRS: అవిశ్వాస తీర్మానంపై ఏ పార్టీకి మద్దతు?.. రేపు వెల్లడించనున్న టీఆర్‌ఎస్‌

  • కేంద్ర సర్కారుపై అవిశ్వాస తీర్మానానికి టీడీపీ, వైసీపీ నోటీసులు
  • అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వనున్న టీఆర్‌ఎస్‌
  • తమకు మద్దతు ఇవ్వాలని ఇప్పటికే టీఆర్‌ఎస్‌ను కోరిన వైసీపీ

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తోన్న టీడీపీ, వైసీపీలు పార్లమెంటులో అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయంపై తెలంగాణ అధికార టీఆర్‌ఎస్ పార్టీ స్పందించింది. అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇస్తామని ప్రకటించింది. అయితే, టీడీపీ, వైసీపీల్లో ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలన్న విషయాన్ని టీఆర్ఎస్ ఇంకా నిర్ణయించుకోలేనట్లు తెలుస్తోంది. ఏ పార్టీకి మద్దతు ఇస్తామనే విషయాన్ని రేపు వెల్లడిస్తామని ప్రకటించింది. కాగా, తమకు మద్దతు ఇవ్వాలని ఇప్పటికే వైసీపీ టీఆర్‌ఎస్‌ను కోరినట్లు సమాచారం. 

More Telugu News