bhojpuri actor: భోజ్ పురీ నటుడ్ని ఛీట్ చేసిన బిల్డర్... కేసు నమోదు

  • ముంబైలో ఇల్లు కట్టుకోవాలని భావించిన భోజ్ పురీ నటుడు సుదీప్ పాండే
  • ఎంఆర్ ఎంటర్ ప్రైజెస్ తో ఒప్పందం
  • మూడు ఫ్లాట్లకు 28 లక్షలు చెల్లించిన సుదీప్

భోజ్ పురి యాక్షన్ హీరో సుదీప్ పాండేను మోసం చేసిన ఘటనలో పోలీసులు బిల్డర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. భోజ్ పురి నటుడు సుదీప్ పాండే ముంబైలోని తలోజా ఫేజ్ 2లో మూడు ఫ్లాట్లు కొనుగోలు చేసేందుకు ఎంఆర్ ఎంటర్‌ ప్రైజెస్ అధినేత ముర్జీ రవారియాతో ఒప్పందం చేసుకున్నాడు. ఒప్పందంలో భాగంగా 28 లక్షల రూపాయల అడ్వాన్స్ కూడా చెల్లించాడు.

ఏడాదిలోపు మూడు ఫ్లాట్లు పూర్తి చేసి ఇస్తానన్న రవారియా ఐదేళ్లు గడిచినా ఫ్లాట్లు అప్పగించలేదు. దీంతో రవారియాపై సుదీప్ పాండే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. కాగా, కేసు దర్యాప్తులో సుదీప్ పాండే బుకింగ్ ను రవారియా రద్దు చేసినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో ఛీటింగ్ కేసు నమోదు చేశారు.

More Telugu News