chiranjeevi: 'సైరా' సెకండ్ షెడ్యూల్ కి రంగం సిద్ధం

  • సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'సైరా'
  • రెండవ షెడ్యూల్లో అమితాబ్ .. నయన్ 
  • షూటింగ్ విశేషాలు బయటపెట్టొద్దనే నిర్ణయం  

'సైరా' సినిమా ఇంతకుముందే ఫస్టు షెడ్యూల్ షూటింగును పూర్తిచేసుకుంది. అయితే ఆ షెడ్యూల్ లో చిత్రీకరించిన కొన్ని సన్నివేశాల పట్ల చిరంజీవి అసంతృప్తిగా ఉండటంతో, ప్రస్తుతం ఆ సన్నివేశాలను హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో చిత్రీకరిస్తున్నారు. ఇక రెండవ షెడ్యూల్ షూటింగును ఈ నెల 23వ తేదీ నుంచి ప్రారంభించనున్నారు.

 ఈ షెడ్యూల్లో అమితాబ్ .. నయనతార కూడా పాల్గొననున్నట్టు తెలుస్తోంది. ఫస్టు షెడ్యూల్ కి .. సెకండ్ షెడ్యూల్ కి మధ్య గ్యాప్ ఎక్కువగా రావడంతో, నానా రకాల పుకార్లు షికారు చేశాయి. అందువలన ఇక నుంచి ఈ సినిమా షూటింగ్ విశేషాలను బయటకి రాకుండా చూడాలని పీఆర్ టీమ్ భావిస్తున్నట్టుగా సమాచారం. అభిమానుల్లో అంచనాలు పెరగకూడదనీ .. షూటింగ్ జరిగే ప్రదేశాల్లో అంతరాయాలు కలగకూడదనే విషయాలను కూడా పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం.    

More Telugu News