kangana ranout: కొత్త ఇల్లు కట్టించుకుని.. గృహ ప్రవేశం చేసిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్

  • హిమాచల్ ప్రదేశ్ లోని మనాలీలో కొత్త ఇల్లు
  • దాదాపు రూ.30 కోట్లు ఖర్చు
  • సకల సదుపాయాలతో కొత్తిల్లు

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ హిమాచల్ ప్రదేశ్ లోని మనాలీలో కొత్త ఇల్లు కట్టించుకుంది. తాజాగా ఆమె గృహ ప్రవేశం చేసింది. ఈ విషయాన్ని తెలుపుతూ ఆమె తన ట్విట్టర్ ఖాతాలో ఫొటోలు పోస్ట్ చేసింది. కొత్త ఇంట్లో ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి పూజలు చేసింది. ఈ ఇల్లు నిర్మించడానికి కంగనా రనౌత్‌కి దాదాపు రూ.30 కోట్లు ఖర్చు అయిందని తెలిసింది. ఆ ఇంటి స్థలం కోసం రూ.10 కోట్లు, ఇంటి నిర్మాణ పనులకు 20 కోట్లు ఖర్చు అయినట్లు సమాచారం. సకల సదుపాయాలతో ఈ ఇల్లు ఉంది. కంగనా రనౌత్ ప్రస్తుతం తెలుగు దర్శకుడు క్రిష్ తీస్తోన్న 'మణికర్ణిక' చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. 

More Telugu News