mohammed shami: ఆ విషయాన్ని దాచి, నన్ను పెళ్లి చేసుకుంది: క్రికెటర్ షమీ

  • అప్పటికే పెళ్లైన సంగతిని దాచి పెట్టింది
  • ఇద్దరు పిల్లలూ సోదరి పిల్లలు అని చెప్పింది
  • ఆ తర్వాత నిజం చెబితే.. షాక్ అయ్యా

క్రికెటర్ మొహమ్మద్ షమీపై ఆయన భార్య హసీన్ జహాన్ ఎన్నో ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఆమె ఫిర్యాదు మేరకు షమీపై హత్యాయత్నం కేసు కూడా నమోదైంది. ఈ నేపథ్యంలో, షమీ ఓ విషయాన్ని వెల్లడించాడు.

తనను పెళ్లి చేసుకునే సమయానికే హసీన్ కు పెళ్లయి, ఇద్దరు పిల్లలు ఉన్నారని షమీ చెప్పాడు. ఆ విషయాన్ని తన వద్ద ఆమె దాచి పెట్టిందని తెలిపాడు. పిల్లలు ఎవరని అడిగితే, చనిపోయిన తన సోదరి పిల్లలు అని చెప్పిందని అన్నాడు. ఆమె చెప్పిన మాటలను గుడ్డిగా నమ్మి, ఆమెను పెళ్లి చేసుకున్నానని చెప్పాడు. ఆ తర్వాత కొంతకాలానికి తనకు అసలు విషయాన్ని చెప్పిందని తెలిపాడు. తనకు పెళ్లి అయిందని, ఆ ఇద్దరు పిల్లలు తన పిల్లలే అని చెప్పిందని... దాంతో తాను షాక్ కు గురయ్యానని చెప్పాడు.

హసీన్ జహాన్ విషయానికి వస్తే, 2002లో ఫషీయుద్దీన్ అనే వ్యక్తిని ఆమె పెళ్లాడింది. వారికి ఇద్దరు పిల్లలు పుట్టారు. ఆ తర్వాత విభేదాలు తలెత్తడంతో 2010లో విడిపోయారు. 2012లో షమీతో పరిచయం ఏర్పడింది. 2014లో పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ ఒక పాప ఉంది. 

More Telugu News