Ramcharan: వివాదంలో చిక్కుకున్న చరణ్ 'రంగస్థలం'

  • వివాదానికి కారణమైన పాట
  • 'గొల్లభామ వచ్చి నా గోరు గిల్లుతుంటే' అనే లిరిక్స్ పై యాదవుల ఆగ్రహం
  • వెంటనే తొలగించకపోతే.. సినిమాను అడ్డుకుంటామంటూ హెచ్చరిక

రామ్ చరణ్, సమంత, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న 'రంగస్థలం' చిత్రం వివాదంలో చిక్కుకుంది. ఈ నెల 30న సినిమాను చిత్ర యూనిట్ విడుదల చేయాలనుకుంటున్న తరుణంలో ఓ వివాదం చుట్టుముట్టింది. ఈ చిత్రంలోని 'రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడూ... పక్కనే ఉంటాడమ్మా పట్టించుకోడు' అనే పాటలో 'గొల్లభామ వచ్చి నా గోరు గిల్లుతుంటే' అనే లిరిక్స్... ఇప్పుడు వివాదానికి ఆజ్యం పోశాయి.

ఈ లిరిక్స్ యాదవ మహిళలను కించపరిచేలా ఉన్నాయని, వాటిని వెంటనే తొలగించాలని ఆల్ ఇండియా యాదవ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు రాములు యాదవ్ డిమాండ్ చేశారు. ఆ లిరిక్స్ ను వెంటనే తొలగించకపోతే... సినిమా విడుదలను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ వివాదంపై ఇంతవరకు చిత్ర యూనిట్ స్పందించలేదు. 

More Telugu News