sai pallavi: అమ్మకు నచ్చిందనే అమ్మగా నటించాను: సాయి పల్లవి

  • 'ప్రేమమ్' తో మలయాళంలోకి ఎంట్రీ
  • 'ఫిదా'తో తెలుగులోకి ఎంట్రీ
  • 'కరు'తో తమిళంలోకి ఎంట్రీ

 ‘ప్రేమమ్‌’ సినిమాలో ‘మలర్‌’ పాత్రతో మలయాళ ప్రేక్షకులను అలరించిన సాయిపల్లవి, తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ‘ఫిదా’ చేసింది. తాజాగా కోలివుడ్ లో ‘కరు’ సినిమాతో అరంగేట్రం చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ప్రమోషన్ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,  ఈ సినిమా కథను తొలుత తాను అంగీకరించలేదని చెప్పింది. దీంతో ఈ చిత్ర కథను దర్శకుడు విజయ్ తన తల్లికి వినిపించారని, ఆమెకు ఈ చిత్ర కథ విపరీతంగా నచ్చిందని తెలిపింది. అందుకే ఇది అమ్మపాత్ర అయినప్పటికీ నటించానని తెలిపింది. సినిమా చాలా బాగా వచ్చిందని, తమిళ ప్రేక్షకులకు నచ్చుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేసింది. కాగా, ఈ సినిమా షూటింగ్ లో యూనిట్ తో పాటు తనను కూడా సాయిపల్లవి తీవ్రంగా ఇబ్బంది పెట్టిందని ఈ సినిమా హీరో నాగశౌర్య ఆరోపించిన సంగతి తెలిసిందే.

More Telugu News