Uttar Pradesh: అతి విశ్వాసమే మా కొంప ముంచింది: సీఎం యోగి ఆదిత్యనాథ్

  • ఎస్పీ-బీఎస్పీ పొత్తును తక్కువ అంచనా వేశాం
  • బీజేపీ ఓటమిపై ఆత్మపరిశీలన చేసుకుంటాం
  • ఈ ఫలితాలు మాకు ఓ గుణపాఠం : యోగి ఆదిత్యనాథ్

యూపీలో జరిగిన లోక్ సభ ఉపఎన్నికల్లో బీజేపీ ఓటమిపాలు కావడంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. ఎస్పీ-బీఎస్పీ పొత్తును తక్కువ అంచనా వేశామని, ఓటమిని అంగీకరిస్తున్నామని అన్నారు. ఈ ఉపఎన్నికల ఫలితాలు తమకు ఓ గుణపాఠమని, ఓటమిపై ఆత్మపరిశీలన చేసుకుంటామని, పార్టీ ఓడిపోవడానికి గల కారణాలు, జరిగిన పొరపాట్లపై విశ్లేషిస్తామని చెప్పారు. ఎస్పీ-బీఎస్పీ పొత్తు ప్రభావం ఎన్నికల ఫలితాలపై ఉండదని భావించామని, స్థానిక అంశాలు కూడా తమ పార్టీ ఓటమికి కారణాలు కావచ్చని అన్నారు. ఈ సందర్భంగా ఉపఎన్నికల్లో విజేతలకు తన అభినందనలు తెలుపుతున్నట్టు యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు.

More Telugu News