ntr: ఎన్టీఆర్ అన్నమాటకు నా కళ్ల వెంట నీళ్లొచ్చాయి: పరుచూరి గోపాలకృష్ణ

  • 'ఆది' పాత్రలో ఎన్టీఆర్ అద్భుతంగా చేశాడు 
  • ఆ సినిమా ప్రెస్ మీట్ లో నన్ను పిలిచాడు 
  • నన్ను పెదనాన్నగా చెప్పుకున్నాడు  

తాజాగా 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ, 'ఆది' సినిమాను గురించిన సంగతులను ప్రస్తావించారు. 'ఆది' సినిమా రష్ చూశాము .. వినాయక్ ఎంత గొప్పగా తీశాడో .. ఎన్టీఆర్ అంతగా ఆ పాత్రకి న్యాయం చేశాడు. ఈ సినిమాకి సంబంధించి ప్రెస్ మీట్ జరుగుతూ ఉండగా 'ఇలా వస్తారా' అని ఎన్టీఆర్ పిలిస్తే దగ్గరికి వెళ్లాను.

 'ఏంటయ్యా' అని అడిగితే .. 'మిమ్మల్ని పెదనాన్న అని పిలవొచ్చా' అని అడిగాడు. ఆయన ఆ మాటనగానే నా కళ్లలో నీళ్లు తిరిగాయి. ' మీ తాతగారు .. మీ నాన్నగారు .. బాబాయిలు అంతా నాకు సోదరుల వంటివారు .. నన్ను నువ్వు పెదనాన్న అని పిలవొచ్చు'అన్నాను. ఆ రోజున ప్రెస్ మీట్లో నన్ను పెదనాన్నగా చెప్పుకున్నాడు .. ఇప్పటికీ అలాగే పిలుస్తాడు' అంటూ చెప్పుకొచ్చారు.     

More Telugu News