nagachaithanya: కొత్త దర్శకుడికి ఓకే చెప్పిన చైతూ!

  • షూటింగు దశలో 'సవ్యసాచి' .. 'శైలజ రెడ్డి అల్లుడు'
  • శివ నిర్వాణ దర్శకత్వంలో మరో మూవీ 
  • మరో మూవీతో కొత్త దర్శకుడికి ఛాన్స్

ప్రస్తుతం నాగ చైతన్య .. చందూ మొండేటి దర్శకత్వంలో 'సవ్యసాచి' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో సమాంతరంగా ఆయన మారుతి దర్శకత్వంలో 'శైలజా రెడ్డి అల్లుడు' చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు చకచకా షూటింగ్ జరుపుకుంటూ ఉండగా, శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి చైతూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ఈ సినిమాలో ఆయన సరసన సమంత నటించనుండటం ప్రత్యేకతను సంతరించుకుంది. ఇక ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లకముందే ఓ కొత్త దర్శకుడికి చైతూ ఓకే చెప్పేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమా కథ .. తన పాత్ర నచ్చడంతో చైతూ మంచి ఉత్సాహాన్ని చూపించాడని అంటున్నారు. అన్నపూర్ణ బ్యానర్లో ఈ సినిమాను నిర్మించనున్నారట. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించనున్నట్టు సమాచారం.     

More Telugu News