somireddy: చెప్పినట్టు చేయకుంటే రాష్ట్రాన్ని మళ్లీ విడదీస్తామన్నట్టు బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు: సోమిరెడ్డి

  • ఓటుకు రెండు రాష్ట్రాల సిద్ధాంతాన్ని బీజేపీ మరోసారి తెర మీదకు తెస్తోంది
  • మోదీపై విశ్వాసం ఉందంటూనే, కేంద్ర ప్ర‌భుత్వంపై అవిశ్వాసం పెడ‌తామ‌ని వైసీపీ అంటోంది
  • జ‌గ‌న్ లాంటి ఆర్థిక నేరగాళ్లకు మోదీ అపాయింట్‌మెంట్‌ ఎలా ఇస్తారు

భార‌తీయ జ‌న‌తా పార్టీపై ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. ఈ రోజు ఆయ‌న అమ‌రావ‌తిలో మీడియాతో మాట్లాడుతూ...  ఓటుకు రెండు రాష్ట్రాల సిద్ధాంతాన్ని బీజేపీ మరోసారి తెర మీదకు తెస్తోందని, తాము చెప్పినట్టు చేయకుంటే ఏపీని మ‌రోసారి విడదీస్తామన్నట్టుగా ఆ పార్టీ నేత‌లు మాట్లాడుతున్నార‌ని సోమిరెడ్డి ఆరోపించారు.

 మ‌రోవైపు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌ మోదీపై విశ్వాసం ఉందంటూనే, కేంద్ర ప్ర‌భుత్వం అవిశ్వాసం పెడ‌తామ‌ని వైసీపీ అంటోంద‌ని ఆయన అన్నారు. బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ వైసీపీ ఏపీకి ద్రోహం చేస్తోందని ఆయ‌న మండిప‌డ్డారు. జ‌గ‌న్ లాంటి ఆర్థిక నేరగాళ్లకు మోదీ అపాయింట్‌మెంట్‌ ఎలా ఇస్తారని ఆయ‌న నిల‌దీశారు. 

More Telugu News