sai dharam tej: టైటిల్ తరువాత చెబుతానంటోన్న తేజు

  • కరుణాకరన్ తో సాయిధరమ్ తేజ్ 
  • కథానాయికగా అనుపమ పరమేశ్వరన్ 
  • త్వరలోనే టైటిల్ విషయంలో క్లారిటీ  

ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా కరుణాకరన్ ఒక సినిమా చేస్తున్నాడు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమాలో, అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ షూటింగ్ పూర్తిచేసుకుంది. ప్రేమకథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాకి 'దేవుడు వరమందిస్తే' అనే టైటిల్ ను ఫిక్స్ చేయనున్నట్టు రెండు రోజులుగా వార్తలు షికారు చేస్తున్నాయి.

 తాజాగా ఈ విషయాన్ని గురించి సాయిధరమ్ తేజ్ ట్విట్టర్ ద్వారా స్పందించాడు. తన తదుపరి సినిమాకి సంబంధించి ఇంతవరకూ ఏ టైటిల్ ను అనుకోలేదనీ .. త్వరలోనే టైటిల్ ను ఎనౌన్స్ చేస్తామని అన్నాడు. ఈ సినిమా టైటిల్ 'దేవుడు వరమందిస్తే' అంటూ జరిగిన ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదనే విషయాన్ని సాయిధరమ్ తేజ్ చెప్పకనే చెప్పేశాడు. ఇక ఈ సినిమాకి ఏ టైటిల్ ను సెట్ చేస్తారో చూడాలి.      

More Telugu News