gautami: అదంతా పుకారే .. ఆ వార్తల్లో నిజం లేదు: గౌతమి

  • సుబ్బులక్ష్మి సినిమాల్లోకి వస్తుందంటూ వార్తలు 
  • ఈ విషయంపై స్పందించిన గౌతమి
  • అందులో నిజం లేదంటూ స్పష్టీకరణ  

తెలుగు .. తమిళ భాషల్లో సీనియర్ కథానాయికగా గౌతమికి మంచి పేరుంది. ఈ మధ్యనే ఆమె తన వయసుకి తగిన ముఖ్యమైన పాత్రలను చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె తన కూతురు సుబ్బులక్ష్మిని కథానాయికగా చేయడానికి ఆసక్తిని చూపుతోందనే వార్తలు వస్తున్నాయి.

ఈ క్రమంలో తమిళంలో రీమేక్ అవుతోన్న 'అర్జున్ రెడ్డి' సినిమాలో కథానాయికగా సుబ్బులక్ష్మి ఎంపిక జరిగిపోయినట్టుగా ప్రచారం జరుగుతోంది. ధృవ్ హీరోగా చేయనున్న ఈ సినిమాలో ఆయన జోడీగా ఆమెను తీసుకున్నారని చెప్పుకుంటున్నారు. తాజాగా ఈ విషయం పట్ల గౌతమి స్పందించారు. సుబ్బులక్ష్మి దృష్టి పూర్తిగా చదువుపైనే ఉందనీ, యాక్టింగ్ వైపుకు వెళ్లే ఆలోచన ఆమెకి లేదని చెప్పారు. ఆ దిశగా ఎలాంటి ప్లాన్ చేయలేదనీ .. ప్రస్తుతం జరుగుతున్నదంతా కేవలం ప్రచారం మాత్రమేనని స్పష్టం చేశారు. సుబ్బులక్ష్మికి ఆశీస్సులను అందజేస్తోన్న వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. 

More Telugu News