Sri Lanka: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా.. ఓవర్లు కుదింపు

  • శ్రీలంకలో ముక్కోణపు టీ 20 సిరీస్‌
  • మొదటి మ్యాచులో శ్రీలంక చేతిలో ఓడిపోయిన టీమిండియా
  • ఈ మ్యాచులో గెలవాలని పట్టుదల 

ముక్కోణపు టీ 20 సిరీస్‌లో భాగంగా భారత్, శ్రీలంక మధ్య కాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. వరుణుడు అడ్డుతగలడంతో ఈ మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం అవుతోంది. మైదానంలో జల్లులు కారణంగా పిచ్‌ను కవర్లతో కప్పి ఉంచారు. ఆలస్యంగా ప్రారంభం అవుతుండడంతో ఈ మ్యాచును 19 ఓవర్లకు కుదించారు. టీమిండియాలో ఒక్క మార్పు మాత్రమే చోటు చేసుకుంది. రిషబ్ పంత్ స్థానంలో కేఎల్ రాహుల్ జట్టులోకి వచ్చాడు. మొదటి మ్యాచులో శ్రీలంక చేతిలో ఓడిపోయిన టీమిండియా ఈ మ్యాచులోనయినా గెలవాలని పట్టుదలతో ఉంది.

భారత్, బంగ్లాదేశ్, శ్రీలంక జట్లు ఆడిన అన్ని మ్యాచుల్లో ఒక్కో మ్యాచులో ఓడి ఒక్కో మ్యాచులో గెలిచాయి. మొదటి మ్యాచు శ్రీలంక, భారత్ కి మధ్య జరగగా భారత్ ఓడి శ్రీలంక గెలిచింది. రెండో మ్యాచులో బంగ్లాదేశ్, భారత్ ఆడగా భారత్ గెలిచి బంగ్లాదేశ్ ఓడింది, మూడో మ్యాచు బంగ్లాదేశ్, శ్రీలంక మధ్య జరగగా శ్రీలంక ఓడి బంగ్లాదేశ్ గెలిచింది.

More Telugu News