nepal: త్రిభువన విమానాశ్రయంలో ఘోర ప్రమాదం.. అదుపుతప్పి రన్ వేని ఢీ కొన్న విమానం.. 50 మంది మృతి

  • విమానంలో 78 మంది ప్రయాణికులు.. 50 మంది మృతి
  • అందులో 67 మంది ప్రయాణికులు బంగ్లాదేశ్ కు చెందిన వారే
  • సురక్షితంగా బయటపడిన 17 మంది ప్రయాణికులు

నేపాల్ రాజధాని ఖాఠ్మండులో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. త్రిభువన అంతర్జాతీయ విమానాశ్రయంలో బంగ్లాదేశ్‌ ఎయిర్‌లైన్‌కు చెందిన విమానం దిగుతుండగా అందులో మంటలు చెలరేగాయి. దీంతో 50 మందికి పైగా ప్రయాణికులు మృతి చెందినట్లు తెలిసింది. విమానంలో మొత్తం 78 మంది ప్రయాణికులు ఉన్నట్లు, వారిలో 67 మంది ప్రయాణికులు బంగ్లాదేశ్ కు చెందిన వారేనని తెలుస్తోంది. 17 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడగా మిగతా ప్రయాణికులను రక్షించేందుకు రెస్క్యూ టీమ్ ప్రయత్నిస్తోంది. ల్యాండ్ అయ్యే సమయంలో అదుపుతప్పి రన్ వేకి ఢీ కొనడంతో విమానంలో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది.        

More Telugu News