assembly: అసెంబ్లీలో కావాలనే ఇలా చేశారు.. చర్యలు తీసుకుంటాం: మంత్రి హరీశ్‌రావు

  • అసెంబ్లీలో జరిగిన ఘటనకు సంబంధించి వీడియో పరిశీలిస్తోన్న అధికారులు
  • కాంగ్రెస్ సభ్యుల తీరు విషయమై కేసీఆర్ నిన్ననే మమ్మల్ని అప్రమత్తం చేశారు-హరీశ్‌రావు
  • సమావేశాల నుంచి బహిష్కరణకు గురవ్వాలనే ఇలా చేశారు

అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నం చేసిన నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. హెడ్ ఫోన్స్ విసరగా అది వెళ్లి మండలి చైర్మన్ స్వామిగౌడ్ కంటికి బలంగా తగిలిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. తెలంగాణ మంత్రి హరీశ్‌రావు ఈ ఘటనపై మాట్లాడుతూ... కాంగ్రెస్ సభ్యుల తీరు విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్ననే తమను అప్రమత్తం చేశారని అన్నారు.

ఈ సమావేశాల నుంచి బహిష్కరణకు గురవ్వాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ నేతలు ఇలా ప్రవర్తించారని హరీశ్‌రావు అన్నారు. ఈ రోజు అసెంబ్లీలో జరిగిన ఘటనకు సబంధించిన దృశ్యాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను అసెంబ్లీ అధికారులు పరిశీలిస్తున్నారు.

More Telugu News