sindhu menon: 'చందమామ' హీరోయిన్ పై కేసు నమోదు

  • రుణం తీసుకుని, చెల్లించని సింధు మీనన్
  • సమర్పించిన పత్రాలు కూడా నకిలీవే
  • సోదరుడి అరెస్ట్

ప్రముఖ సినీ హీరోయిన్ సింధు మీనన్ పై చీటింగ్ కేసు నమోదైంది. బెంగళూరులోని ఆర్ఎంసీ యార్డ్ పోలీస్ స్టేషన్ లో ఆమెతో పాటు ఆమె ముగ్గురు సోదరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు వివరాల్లోకి వెళ్తే, జుబిలెంట్ మోటార్స్ వక్ఫ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఆర్ఎంసీ యార్డ్ లోని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్ నుంచి ఆమె రూ. 36 లక్షల రుణం తీసుకున్నారు. ఆ తర్వాత తీసుకున్న రుణాన్ని ఆమె చెల్లించలేదు. అంతేకాదు, రుణం కోసం ఆమె సమర్పించిన పత్రాలను కూడా నకిలీవిగా గుర్తించారు. ఈ నేపథ్యంలో, బ్యాంకు అధికారులు పోలీసులను ఆశ్రయించారు.

కేసు నమోదు చేసిన పోలీసులు... సింధును అరెస్ట్ చేసేందుకు యత్నించినప్పటికీ... ఆమె విదేశాల్లో ఉన్నందున అరెస్ట్ వీలుకాలేదు. దీంతో, ఆమె సోదరుడు కార్తికేయన్ ను అదుపులోకి తీసుకున్నారు. 'చందమామ' సినిమాతో సింధు మీనన్ మంచి పేరు తెచ్చుకుంది. పలు సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువైంది.

More Telugu News