Sri Lanka: ముక్కోణపు సిరీస్‌: బంగ్లాదేశ్‌ ముందు 215 పరుగుల లక్ష్యాన్ని ఉంచిన శ్రీలంక

  • టాస్ గెలిచి మొదట శ్రీలంకను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన బంగ్లాదేశ్
  • కుషల్ మెండీస్ 57, కుషల్ పెరీరా74 , ఉపుల్ తరంగా 32 పరుగులు
  • బంగ్లాదేశ్‌ బౌలర్లలో ముస్తాఫిజుర్‌కి 3, మహ్మదుల్లాకి 2, తస్కిన్‌కి 1 వికెట్

శ్రీలంక వేదికగా భారత్, బంగ్లాదేశ్, శ్రీలంక క్రికెట్ జట్ల మధ్య ముక్కోణపు టీ20 సిరీస్ జరుగుతోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ రోజు శ్రీలంక, బంగ్లాదేశ్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన బంగ్లాదేశ్.. శ్రీలంకను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. శ్రీలంక బ్యాట్స్ మెన్ కుషల్ మెండీస్ 57, కుషల్ పెరీరా74 , ఉపుల్ తరంగా 32 పరుగులతో బంగ్లాదేశ్ బౌలర్లను బెదరగొట్టారు. మిగతా బ్యాట్స్ మెన్ లో గుణతిలక 26, షనకా 0, చండిమాల్ 2, తిషార పెరీరా 0, జీవన్ మెండీస్ 6 పరుగులు చేశారు. దీంతో బంగ్లాదేశ్ ముందు శ్రీలంక 215 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. బంగ్లాదేశ్‌ బౌలర్లలో ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌ మూడు వికెట్లు తీయగా, మహ్మదుల్లా రెండు, తస్కిన్‌ అహ్మద్ ఒక వికెట్ తీశాడు.

More Telugu News