srirama navami: శ్రీరామనవమి కోసం.. భద్రాచలం సీతారాముల‌ క‌ల్యాణ మ‌హోత్స ఆహ్వాన ప‌త్రిక‌ ఆవిష్క‌రణ

  • ఈ నెల 26‌న జ‌ర‌గ‌నున్న స్వామివారి క‌ల్యాణ మ‌హోత్స‌వం
  • హైదరాబాద్‌లోని ఆర్అండ్‌బీ గెస్ట్ హౌస్‌లో ఆహ్వాన ప‌త్రిక‌ ఆవిష్క‌రణ
  • క‌ల్యాణ శోభ ఉట్టిప‌డేలా మండ‌పాన్ని తీర్చిదిద్దుతోన్న తెలంగాణ
  • స్వామి వారి క‌ల్యాణానికి అంద‌రూ అహ్వానితులే

ద‌క్షిణ ఆయోధ్య‌గా పేరుగాంచిన భ‌ద్రాచ‌ల క్షేత్రంలో శ్రీ సీతారాముల క‌ల్యాణ మ‌హోత్స‌వాన్ని వైభ‌వంగా నిర్వ‌హించేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం అన్ని ఏర్పాటు చేస్తోంద‌ని మంత్రులు ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, తుమ్మ‌ల నాగేశ్వ‌ర రావు తెలిపారు. ఈ నెల 26‌న జ‌ర‌గ‌నున్న స్వామివారి క‌ల్యాణ మ‌హోత్స‌వ ఆహ్వాన ప‌త్రిక‌, గోడ ప‌త్రిక‌లను మంత్రులు హైదరాబాద్‌లోని ఎర్ర‌మంజిల్ లోని ఆర్అండ్‌బీ గెస్ట్ హౌస్‌లో ఆవిష్క‌రించారు. మిథిల ప్రాంగణంలో జ‌రిగే క‌ల్యాణ మ‌హోత్స‌వాన్ని తిల‌కించేందుకు వ‌చ్చే భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా ప్ర‌భుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంద‌ని వెల్ల‌డించారు.

క‌ల్యాణ శోభ ఉట్టిప‌డేలా మండ‌పాన్ని తీర్చిదిద్దుతున్న‌ట్లు మంత్రులు చెప్పారు. స్వామి వారి క‌ల్యాణానికి అంద‌రూ అహ్వానితులేన‌ని అన్నారు. ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి కేసీఆర్ స‌తీస‌మేతంగా స్వామి వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారని తెలిపారు. తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా చ‌త్తీస్‌గఢ్‌, మ‌హారాష్ట్ర, ఒడిశా, క‌ర్ణాట‌క‌ రాష్ట్రాల నుంచి ల‌క్ష‌లాది మంది భ‌క్తులు త‌ర‌లివ‌స్తార‌ని, వారి కోసం స‌క‌ల సౌక‌ర్యాలు క‌ల్పిస్తున్నామ‌ని తెలిపారు. ఇత‌ర రాష్ట్రాల భ‌క్తుల కోసం హిందీ భాష‌లో కూడా గోడ ప‌త్రిక‌ను ముద్రించిన‌ట్లు చెప్పారు. ఈ కార్య‌క్ర‌మంలో భ‌ద్రాద్రి ఆల‌య ఈవో ప్ర‌భాక‌ర శ్రీనివాస శ‌ర్మ, ఖ‌మ్మం డీసీసీబీ చైర్మ‌న్ మువ్వ విజ‌య‌బాబు పాల్గొన్నారు.  
త్వ‌ర‌లోనే భ‌ద్రాద్రి ఆల‌య పున‌ర్నిర్మాణ ప‌నులు ప్రారంభం

యాదాద్రి త‌ర‌హాలోనే భ‌ద్రాద్రి  పుణ్య‌క్షేత్ర  పున‌ర్నిర్మాణ ప‌నులు చేప‌డ‌తామ‌ని మంత్రులు ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, తుమ్మ‌ల నాగేశ్వ‌ర రావు తెలిపారు. ఉగాది ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్... త్రిదండి శ్రీ చిన‌జీయ‌ర్ స్వామిని సంప్ర‌దించి ఆల‌య అభివృద్ధి ప‌నులను ప్రారంభించ‌నున్న‌ట్లు చెప్పారు. ఈ నెల 27న శ్రీ సీతారామ‌చంద్ర స్వామి ప‌ట్టాభిషేకం రోజున సీఎం కేసీఆర్ స‌మ‌యానుకూల‌త‌ను బ‌ట్టి ఆయ‌న చేతుల మీదుగా ఆల‌య అభివృద్ధి ప‌నులకు శంఖుస్థాప‌న చేసే అవ‌కాశం ఉంద‌ని వెల్ల‌డించారు. ఆల‌య అభివృద్ధి ప‌నుల‌కు ఇప్ప‌టికే కేసీఆర్ రూ.100 కోట్లు మంజూరు చేశార‌ని, అవ‌స‌ర‌మైతే మ‌రిన్ని నిధులు కేటాయిస్తార‌ని పేర్కొన్నారు.

More Telugu News