anjali: హారర్ కామెడీగా వచ్చిన 'గీతాంజలి'కి సీక్వెల్

  • అంజలి కెరియర్లో చెప్పుకోదగినదిగా 'గీతాంజలి'
  • కోన వెంకట్ నిర్మాణంలో సీక్వెల్ కి ప్లాన్ 
  • దర్శకుడిగా 'సుబ్బు' పరిచయం  

హారర్ కామెడీగా కొంతకాలం క్రితం వచ్చిన 'గీతాంజలి' అనూహ్యమైన విజయాన్ని సాధించింది. అంజలి ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాలో, శ్రీనివాస్ రెడ్డి కీలకమైన పాత్రలో కనిపిస్తాడు. రాజ్ కిరణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ ఇద్దరికీ కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది.

కోన వెంకట్ సమర్పించిన ఈ సినిమాకి సీక్వెల్ రానుందనే వార్తలు అప్పుడప్పుడు వినిపిస్తూ వచ్చాయి. తాజాగా మళ్లీ ఈ వార్త తెరపైకి వచ్చింది. అంజలి .. శ్రీనివాస్ రెడ్డి ప్రధానమైన పాత్రలుగా కోన వెంకట్ ఈ సినిమాను నిర్మించనున్నట్టు సమాచారం. ఈ సీక్వెల్ ద్వారా 'సుబ్బు' అనే నూతన దర్శకుడు పరిచయం కానున్నాడని అంటున్నారు. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టేశారు .. త్వరలోనే అధికారిక ప్రకటన చేయడానికి సిద్ధమవుతున్నారు.   

More Telugu News