Police: తుపాకీతో సెల్ఫీ.. ప్రాణాలు కోల్పోయిన టీచర్‌

  • ఢిల్లీలో ఘటన
  • యువకుడితో కలిసి ఉపాధ్యాయుడు సెల్ఫీ 
  • తుపాకీ పేలడంతో మృతి
  • యువ‌కుడి అరెస్టు

ప్రమాద‌క‌ర ప్ర‌దేశాల్లో, ప్రమాదకర వ‌స్తువుల‌తో సెల్ఫీలు తీసుకుంటూ ప్రాణాలు కోల్పోతున్నారు కొంద‌రు సెల్ఫీ ప్రియులు. సెల్ఫీల కార‌ణంగా ప్రాణాలు కోల్పోతోన్న వారి గురించి ప్ర‌తిరోజు వార్త‌ల్లో వ‌స్తున్న‌ప్ప‌టికీ సెల్ఫీ ప్రియులు ఆ మోజులోంచి బ‌య‌ట‌కు రాలేక‌పోతున్నారు. నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తూ విలువైన జీవితాన్ని బ‌లిచేసుకుంటున్నారు. తాజాగా, ఇటువంటిదే మ‌రో ఘ‌ట‌న వెలుగులోకొచ్చింది. ఢిల్లీలో ఓ ఉపాధ్యాయుడు ఓ యువకుడితో కలిసి గన్‌తో సెల్ఫీ తీసుకోబోయాడు.

అది ఒక్క‌సారిగా పేలడంతో ఆ టీచర్‌ ప్రాణాలు కోల్పోయాడు. స‌ద‌రు టీనేజీ యువ‌కుడు అనుకోకుండా తుపాకీ ట్రిగ్గర్‌ నొక్కినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ తుపాకీ ఆ కుర్రాడి తండ్రిదని, దానికి లైసెన్స్‌ ఉందని గుర్తించారు. ఆ యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్నారు. 

More Telugu News