nikhil: 'కిరాక్ పార్టీ' ఆడియో ఫంక్షన్ రేపే!

  • నిఖిల్ హీరోగా 'కిరాక్ పార్టీ'
  • దర్శకుడిగా శరణ్ కొప్పిశెట్టి 
  • ఈ నెల 16న ప్రేక్షకులముందుకు  

నితిన్ కథానాయకుడిగా .. సంయుక్తా హెగ్డే - సిమ్రాన్ పరీన్జ కథానాయికలుగా 'కిరాక్ పార్టీ' రూపొందింది. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఆడియో వేడుకను జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు.

విజయవాడలో రేపు సాయంత్రం ఈ ఫంక్షన్ ను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి అక్కడి ఉషారమ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ వేదికగా మారుతోంది. నిఖిల్ కి స్నేహితులైన చందూ మొండేటి .. సుధీర్ వర్మ ఈ సినిమాకి రచనా సహకారాన్ని అందించడం విశేషం. ఈ సినిమాతోను నిఖిల్ హిట్ కొడతాడేమో చూడాలి.   

More Telugu News