Jairam Ramesh: జైరాం రమేష్ చెయ్యి చూసి జాతకం చెప్పిన చిత్తూరు ఎంపీ శివప్రసాద్!

  • హోదాను డిమాండ్ చేస్తూ శివప్రసాద్ వినూత్న వేషధారణ
  • నేడు కోయదొర వేషంలో పార్లమెంట్ కు
  • జైరాం రమేష్ చెయ్యి చూసి పరిస్థితి బాగా లేదని వ్యాఖ్య

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ తెలుగుదేశం ఎంపీలు చేస్తున్న నిరసనల్లో భాగంగా నిత్యమూ తనదైన వేషధారణలో పార్లమెంట్ కు వస్తున్న చిత్తూరు ఎంపీ, నటుడు శివప్రసాద్, నేడు ఓ కోయదొర వేషంలో వినూత్నంగా కనిపించారు. పార్లమెంట్ ఆవరణలో అటూఇటూ తిరుగుతున్న ఆయనకు కాంగ్రెస్ నేత జైరాం రమేష్ కనిపించగా, ఆయన చేతిని తన చేతిలోకి తీసుకుని చేతి రేఖల గురించి వివరిస్తూ జాతకం చెప్పారు.

 కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాగాలేదని ఈ చెయ్యిని చూస్తే తెలిసిపోతుందని వ్యాఖ్యానించారు. గతంలో ఈ చెయ్యి ఎంతో అధికారాన్ని చూసిందని ఈ రేఖను చూస్తే కనిపిస్తోందని, ఇప్పుడు మాత్రం గడ్డు పరిస్థితిలో ఉన్నావని జోకులు వేశారు. వీరిద్దరిని, వారి మధ్య సంభాషణను పక్కనే ఉన్న ఎంపీలు, మీడియా వారు ఆసక్తిగా తిలకించారు.

More Telugu News