Cricket: ముక్కోణ‌పు టీ20 సిరీస్: బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్

  • భార‌త్, శ్రీలంక‌, బంగ్లాదేశ్‌ల మ‌ధ్య ముక్కోణ‌పు టీ20 సిరీస్
  • కొలంబోలోని ప్రేమ‌దాస స్టేడియంలో బంగ్లాదేశ్‌తో రెండో టీ20 మ్యాచ్
  • టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా

భార‌త్, శ్రీలంక‌, బంగ్లాదేశ్‌ల మ‌ధ్య ముక్కోణ‌పు టీ20 సిరీస్ జరుగుతోన్న విషయం తెలిసిందే. మొదటి మ్యాచ్‌లో శ్రీలంకతో తలబడి ఓడిపోయిన టీమిండియా ఈ రోజు కొలంబోలోని ప్రేమ‌దాస స్టేడియంలో బంగ్లాదేశ్‌తో రెండో టీ20 మ్యాచ్ ఆడుతోంది. టాస్ గెలిచిన టీమిండియా మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం క్రీజులో బంగ్లాదేశ్ ఓపెనర్లు తమిమ్ ఇక్బల్, సౌమ్య సర్కార్ ఉన్నారు. గత మ్యాచ్‌లో శ్రీలంకతో ఊహించని రీతిలో ఓడిపోయిన టీమిండియా ఈ మ్యాచ్‌లోనయినా విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్‌లో టీమిండియాలో ఎటువంటి మార్పులు చేయలేదు. రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, రైనా, మనీష్ పాండే, దినేశ్ కార్తీక్, రిషబ్ పాంత్, వాషింగ్టన్ సుందర్, విజయ్ శంకర్, శార్దూల్ ఠాకూర్, జయ్‌దేవ్, ఛాహెల్ ఉన్నారు.  

More Telugu News