sanjay dutt: వీరాభిమానం: తన ఆస్తిని సంజయ్ దత్ కి రాసిచ్చేసిన అభిమాని!

  • సంజయ్ దత్ పై అభిమానం 
  • ఆస్తులు రాసిచ్చిన వైనం 
  • ఆశ్చర్యపోయిన సంజయ్ దత్

వెండితెరపై వెలుగొందే హీరోలను .. హీరోయిన్లను అభిమానించడం సాధారణంగా జరుగుతూ ఉంటుంది. తమ అభిమాన తారలను కలుసుకున్నప్పుడు ఫోటోలను .. ఆటోగ్రాఫ్ లను తీసుకోవడంలోనే అభిమానులు ఎంతో ఆనందాన్ని పొందుతుంటారు. అయితే ఓ అభిమాని మాత్రం తన అభిమాన హీరో నుంచి ఫోటోలను .. ఆటోగ్రాఫ్ లాంటివి తీసుకోవడం కాదు, తన ఆస్తిని మొత్తం ఆయనకి రాసిచ్చేసింది.

ఆ హీరో సంజయ్ దత్ అయితే .. ఆ అభిమాని బరోడాకు చెందిన నిశి హరిశ్చంద్ర త్రిపాఠి. సంజయ్ దత్ ను ఎంతగానో అభిమానించే ఆమె , 62 యేళ్ల వయసులో ఇటీవల మరణించింది. బరోడాలోని ఓ బ్యాంకు బ్రాంచ్ లో ఆమె పేరుతో ఓ లాకర్ వుంది. అందులో భారీ మొత్తంలో నగదు .. విలువైన వస్తువులు వున్నాయట. బ్యాంకు అధికారులు ఫోన్ చేసి ఆ లాకర్ ను స్వాధీనం చేసుకోవలసిందిగా సంజయ్ దత్ ను కోరగా, ఆయన ఆశ్చర్యపోయారట. నిశి కుటుంబ సభ్యులతో మాట్లాడిన సంజయ్ దత్ .. ఆ ఆస్తులు ఆమె కుటుంబ సభ్యులకే చెందే పనులను చట్టపరంగా చేస్తున్నారట.       

More Telugu News