Coimbattore: కలెక్టర్ లేరని చెబుతున్నా వినకుండా నానాయాగీ చేసిన తమిళ హీరోయిన్!

  • స్థల పట్టాలో మార్పు కోరుతూ వచ్చిన వనిత
  • కలెక్టర్ లేరని చెప్పగా అధికారులతో వాగ్వాదం
  • ఎంతగా తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపణ

స్థలం పట్టాలో మార్పు కోరుతూ కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన తమిళ నటి వనితా విజయకుమార్, ఆయన లేరని, తరువాత రావాలని చెప్పినా వినకుండా అధికారులతో వాగ్వాదానికి దిగి నానాయాగీ చేసిన ఘటన కోయంబత్తూరు కలెక్టరేట్ లో కలకలం రేపింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, కోయంబత్తూరులో తనకు చెందిన ఓ స్థలం ఉందని, దాన్ని తన పేరు మీదకు పట్టా మార్పు చేయాలని రెవెన్యూ అధికారులను పలుమార్లు కోరినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ, రాత్రి 8 గంటల సమయంలో ఆమె కలెక్టర్ ను కలిసి ఫిర్యాదు చేస్తానంటూ వచ్చింది.

 ఆ సమయంలో కోయంబత్తూరు కలెక్టర్ హరిహరన్ అధికారిక కార్యక్రమంలో పాల్గొనే నిమిత్తం చెన్నై వెళ్లి ఉన్నారు. ఇక అదే విషయాన్ని ఆమెకు చెప్పి, తరువాత వచ్చి సమస్యను పరిష్కరించుకోవాలని అధికారులు సూచించగా, వనిత రెచ్చిపోయింది. అధికారులతో గొడవ పడిన ఆమె, ఆపై మీడియాతో మాట్లాడుతూ, పట్టాను మార్చాలని ఎంతగా తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, ఎన్నిసార్లు తిరిగినా, ఏవో లోపాలు ఉన్నట్టు అధికారులు అడ్డుకుంటున్నారని ఆమె ఆరోపించింది. కాగా, నటుడు విజయ్ కుమార్, నటి మంజుల కుమార్తే ఈ వనిత.

More Telugu News