Sri Lanka: శ్రీలంక విజయ లక్ష్యం 175 పరుగులు

  • కొలంబోలో మొదటి టీ20
  • టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండియా
  • శిఖ‌ర్ ధావ‌న్ 90 ప‌రుగులు

కొలంబో వేదిక‌గా భార‌త్, శ్రీలంక‌ జట్ల మ‌ధ్య జ‌రుగుతోన్న టీ20 మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవ‌ర్లలో ఐదు వికెట్ల న‌ష్టానికి 174 ప‌రుగులు చేసింది. టీమిండియా బ్యాట్స్ మెన్ లో ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మ డ‌కౌట్ కాగా, శిఖ‌ర్ ధావ‌న్ ధాటిగా ఆడి 90 ప‌రుగులు చేశాడు. సురేశ్ రైనా 1, మ‌నీశ్ పాండే 37, రిష‌బ్ పంత్ 23 చేశారు. దినేశ్ కార్తీక్ 13 ప‌రుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. శ్రీలంక బౌల‌ర్ల‌లో చ‌మీరా రెండు వికెట్లు తీయ‌గా, నువాన్ ప్ర‌దీప్, మెండిస్  లు చెరో వికెట్ తీశారు.  

More Telugu News