vijay devarakonda: అత్యధిక థియేటర్లలోకి విజయ్ దేవరకొండ 'ఏ మంత్రం వేశావే'

  • విజయ్ దేవరకొండ హీరోగా 'ఏ మంత్రం వేశావే'
  • కథానాయికగా శివాని సింగ్ పరిచయం 
  • ఈ నెల 9వ తేదీన విడుదల

యూత్ లో ఇప్పుడు విజయ్ దేవరకొండకి గల క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయన సినిమా విశేషాలు తెలుసుకోవడానికి అంతా ఎంతో ఆసక్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి ' ఏ మంత్రం వేశావే'  ముస్తాబవుతోంది. నిజానికి విజయ్ దేవరకొండ చేసిన ఫస్టు మూవీ ఇదే. అయితే కొన్ని కారణాల వలన విడుదల విషయంలో జాప్యం జరుగుతూ వచ్చింది.

ఈలోగా విజయ్ దేవరకొండ మార్కెట్ పెరిగిపోవడం ఈ సినిమాకి కలిసొచ్చే అంశం. విజయ్ దేవరకొండ .. శివాని సింగ్ జంటగా నటించిన ఈ సినిమాను, ఈ నెల 9వ తేదీన భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. విజయ్ దేవరకొండకి గల క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాను 650 థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. గోలీసోడా ఫిలిమ్స్ నిర్మించిన ఈ సినిమాకి శ్రీధర్ మర్రి దర్శకత్వం వహించాడు. 

More Telugu News