Srilanka: 'మాస్టర్ బ్లాస్టర్‌'కు శ్రీలంక ప్రత్యేక ఆహ్వానం

  • 70వ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాలని లంక బోర్డు లేఖ
  • బిజీ షెడ్యూల్ వల్ల రాలేకపోతున్నానన్న మాస్టర్
  • లంక ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌కి శ్రీలంక ప్రత్యేక ఆహ్వానం పంపింది. తమ దేశ 70వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు హాజరుకావాలంటూ ఆయనకు ఓ లేఖ పంపింది. అయితే బిజీ షెడ్యూల్ కారణంగా రాలేకపోతున్నానని సచిన్ సమాధానం పంపారు. లంక ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. శ్రీలంక క్రికెట్ బోర్డు అధ్యక్షుడు తిలంగ సుమతిపాల పంపిన లేఖకు ఆయన ఈ మేరకు స్పందించారు.

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని తమ దేశం ఆతిథ్యమిస్తున్న నిదహాన్ ట్రోఫీ మ్యాచ్‌లను వీక్షించాలని కూడా మాస్టర్‌ను సుమతిపాల తన లేఖలో కోరారు. గతంలో ఒకసారి నిదహాన్ ట్రోఫీలో శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ క్రికెటర్ల ద్వయం సచిన్-గంగూలీ తొలి వికెట్ నష్టానికి 252 పరుగులు సాధించిన సంగతి తెలిసిందే. కాగా, లంక తన 50 ఏళ్ల స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా భారత్-శ్రీలంక-న్యూజిలాండ్ జట్ల మధ్య ముక్కోణపు వన్డే సిరీస్‌ను నిర్వహించారు.

More Telugu News