nagashourya: సాయిపల్లవి పట్ల నాగశౌర్య అసహనం తగ్గనట్లే!

  • సాయిపల్లవి ప్రధాన పాత్రలో 'కణం'
  • ఆమె ధోరణి పట్ల నాగశౌర్య అసహనం 
  • సినిమా ప్రమోషన్స్ కి కూడా దూరం

సాయిపల్లవి .. నాగశౌర్యలు తమిళంలో 'కరు' అనే సినిమా చేశారు. తెలుగులో ఈ సినిమా 'కణం' అనే పేరుతో విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను జరుపుకుంది. ఈ ఫంక్షన్ కి నాగశౌర్య హాజరుకాకపోవడం విశేషం. ఈ సినిమా షూటింగ్ సమయంలో నాగశౌర్య .. సాయిపల్లవి మధ్య మనస్పర్థలు వచ్చాయనే టాక్ వచ్చింది. సాయిపల్లవి ధోరణి తనని చాలా ఇబ్బంది పెట్టిందని నాగశౌర్య బయటికి చెప్పేశాడు.

అలా అసహనాన్ని వ్యక్తం చేయడం ఆయన వ్యక్తిగతం అంటూ సాయిపల్లవి సమాధానమిచ్చింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి నాగశౌర్య వస్తే సాయిపల్లవితో మనస్పర్థలు తొలగిపోయినట్టు .. రాలేదంటే ఆ  గొడవ కొనసాగుతున్నట్టేనని అంతా అనుకున్నారు. నాగశౌర్య ఈ వేడుకకి రాకుండా .. తమ మధ్య విభేదాలు తొలగిపోలేదని చెప్పకనే చెప్పాడు. ఇక దర్శక నిర్మాతలు ఆమెకి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారనే అలక కారణంగా కూడా ఆయన ఈ సినిమాకి దూరంగా ఉంటున్నాడని అంటున్నారు.         

More Telugu News