air asia: దేశీయ ప్రయాణం 799 రూాపాయలకే.. ఎయిర్ ఏషియా బంపర్ ఆఫర్

  • దేశీయ ప్రయాణం 799 రూపాయలకే
  • ఒక వైపు ప్రయాణం ప్రారంభ టికెట్ ధర అన్నిపన్నులు కలుపుకుని 799 రూపాయలు
  • అంతర్జాతీయ ప్రయాణ ప్రారంభ ధర 999 రూపాయలు

ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్‌ ఏషియా బంపర్ ఆఫర్‌ ను ప్రకటించింది. దేశీయ ప్రయాణాన్ని కేవలం 799 రూపాయలకే అందించనున్నట్టు వెల్లడించింది. ఈ ఆఫర్ లో ఈ నెల 11 లోపు టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుందని, ప్రయాణం మాత్రం 3 సెప్టెంబర్ నుంచి వచ్చే ఏడాది మే 28 లోపు ప్రయాణించాల్సి ఉంటుందని తెలిపింది. అన్ని పన్నులు కలుపుకొని ఒకవైపు ప్రారంభ విమాన టిక్కెట్టు ధరను 799 రూపాయలుగా నిర్ణయించినట్టు తెలిపింది.

ఈ ఆఫర్ హైదరాబాద్‌, బెంగళూరు, న్యూఢిల్లీ, కోల్‌ కతా, గోవా, జైపూర్, పుణె, ఇంపాల్, వైజాగ్, శ్రీనగర్, రాంచి, భువనేశ్వర్, చెన్నైల మధ్య తిరిగే ఎయిర్ ఏషియా విమానాలకు వర్తించనుందని తెలిపింది. ఈ ఆఫర్ తో పాటు 999 రూపాయలకే అంతర్జాతీయ ప్రయాణ టికెట్ ను కూడా అందించనున్నట్టు తెలిపింది. వివరాలకు ఎయిర్ ఏషియా వెబ్ సైట్ చూడాలని తెలిపింది. 

More Telugu News