airindia: ప్రయాణికుడికి గుండెపోటుతో... అత్యవసరంగా జపాన్ లో ల్యాండయిన ఎయిర్ ఇండియా విమానం

  • ఢిల్లీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకు వెళుతున్న విమానం
  • అత్యవసర పరిస్థితితో జపాన్ లోని సప్పోరోకు మళ్లింపు
  • తిరిగి గమ్యస్థానానికి బయల్దేరిన విమానం

ఎయిర్ ఇండియాకు చెందిన ఓ విమానం ఢిల్లీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకు వెళుతూ అత్యవసరంగా జపాన్ లో ల్యాండయింది. ఎయిర్ ఇండియాకు చెందిన ఫ్లయిట్ ఏఐ173 విమానంను అత్యవసర పరిస్థితుల్లో జపాన్ లోని సప్పోరోకు మళ్లించినట్టు ట్విట్టర్ లో ఎయిర్ ఇండియా పేర్కొంది. దీనిపై ఎయిర్ ఇండియా అధికార ప్రతినిధి మాట్లాడుతూ... విమానంలో ఓ ప్రయాణికుడికి గుండెపోటు రావడం వల్లే విమానాన్ని జపాన్ లోని సప్పోరోకు మళ్లించినట్టు చెప్పారు. అయితే, అనంతరం ఇదే విమానం చిటోసే (సప్పోరో పట్టణానికి సమీపంలో) అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి తిరిగి బయల్దేరి వెళ్లినట్టు ఎయిర్ ఇండియా ట్విట్టర్ లో పేర్కొంది. అయితే, గుండెపోటు వచ్చిన సదరు ప్రయాణికుడి వైద్య పరిస్థితిపై సమాచారం లేదు.

More Telugu News