Nitya: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • నిత్యా మీనన్ ఆ పాత్రలు చేయదట!
  • డబ్బింగ్ మొదలెట్టిన చరణ్ 
  • మళ్లీ వస్తున్న నాటి నాయిక 
  • మరో చిత్రానికి ఓకే చెప్పిన వరుణ్ తేజ్

*  మల్లూ బేబీ నిత్యా మీనన్ కెరీర్ పరంగా ఓ నిర్ణయం తీసుకుందట. అదేమిటంటే, తాను నటించే సినిమాలో తన పాత్ర చనిపోకూడదట. అలాంటి పాత్రలనే అంగీకరిస్తానని అంటోంది. కొన్ని సినిమాల్లో చనిపోయే పాత్రలు చేశానని, అయితే అది తనకు నచ్చడం లేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పింది.
*  సుకుమార్ దర్శకత్వంలో రామ చరణ్ నటిస్తున్న 'రంగస్థలం' చిత్రం డబ్బింగ్ కార్యక్రమం జరుగుతోంది. ప్రస్తుతం చరణ్ తన పాత్రకు డబ్బింగ్ చెబుతున్నాడు. గోదావరి యాసలో చెప్పాలి కాబట్టి పెర్ఫెక్షన్ కోసం ఎక్కువ సమయం తీసుకుని, డబ్బింగ్ చెబుతున్నాడట.  
*  గతంలో స్టార్ హీరోలతో కథానాయికగా నటించిన నిరోషా చాలా కాలం తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెడుతోంది. 'నువ్వు తోపురా' పేరుతో రూపొందుతున్న చిత్రంలో హీరోకి తల్లిగా నిరోషా నటిస్తోంది. ప్రముఖ నటి రాధికకు నిరోషా చెల్లెలన్న సంగతి తెలిసిందే.    
*  ప్రస్తుతం సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ చిత్రం చేస్తున్న మెగా హీరో వరుణ్ తేజ్ తాజాగా మరో చిత్రం అంగీకరించాడు. 'అప్పట్లో ఒకడుండేవాడు' ఫేం సాగర్ చంద్ర ఇటీవల వరుణ్ కి ఓ కథ వినిపించాడని, అది బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేశాడని అంటున్నారు.

More Telugu News