lgx4: ఎల్‌జీ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్!

  • సౌత్ కొరియాలో విడుదలైన 'ఎల్‌జీ ఎక్స్4'
  • త్వరలో భారత్ మార్కెట్లోకి
  • బ్లాక్, గోల్డ్ కలర్ లలో లభ్యం

ఎల్‌జీ కంపెనీ తన నూతన స్మార్ట్‌ఫోన్ 'ఎక్స్4'ను సౌత్ కొరియాలో తాజాగా విడుదల చేసింది. ఇందులో డిజిటల్ పేమెంట్ ఫీచర్ అయినా 'ఎల్‌జీ పే' తో పాటు ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. త్వరలో ఈ స్మార్ట్ ఫోన్ రూ.17,780 ధరతో భారత మార్కెట్లోకి కూడా రాబోతోంది. డీఎంబీ టీవీ ఫీచర్‌ ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్ బ్లాక్, గోల్డ్ వేరియంట్ కలర్ లలో లభిస్తుంది.

ఎల్‌జీ ఎక్స్4 స్పెసిఫికేషన్స్ :

  • ఆండ్రాయిడ్ 7.1 నూగట్ ఆపరేటింగ్ సిస్టం
  • 5.3" హెచ్‌డీ డిస్‌ప్లే
  • 720x1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
  • 2జీబీ ర్యామ్, 16జీబీ స్టోరేజ్ (మెమొరీ కార్డు ద్వారా 2టీబీ వరకు పెంచుకోవచ్చు)
  • 1.4 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్
  • 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా
  • ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఎల్‌జీ పే, హెచ్‌డీ డీఎంబీ టీవీ
  • 4జీ ఎల్‌టీఈ, వైఫై, బ్లూటూత్, ఎన్‌ఎఫ్‌సీ
  • 3000mAh బ్యాటరీ

More Telugu News