kalyan ram: కల్యాణ్ రామ్ .. తమన్నా మూవీ రిలీజ్ కి ముహూర్తం కుదిరింది!

  • కల్యాణ్ రామ్ హీరోగా 'నా నువ్వే'
  • కథానాయికగా తమన్నా 
  • మే 25వ తేదీన విడుదల  

ప్రస్తుతం కల్యాణ్ రామ్ రెండు సినిమాలు చేస్తున్నాడు. ఒకటి కాజల్ కథానాయికగా చేస్తోన్న 'ఎమ్మెల్యే' అయితే .. మరొకటి తమన్నాతో చేస్తోన్న 'నా నువ్వే'. ఈ రెండు సినిమాలు కూడా వెరైటీ కంటెంట్ తో రూపొందుతున్నాయి. తాజాగా 'నా నువ్వే' సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు.

మే 25వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ తో దర్శకుడిగా జయేంద్ర పరిచయమవుతున్నాడు. ఇంతవరకూ కల్యాణ్ చేసిన పాత్రలకి .. ఈ పాత్ర పూర్తి భిన్నంగా ఉంటుందని అంటున్నారు. ఆయన ఈ సినిమాలో డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడని చెబుతున్నారు. ఈ సినిమాతో తనకి తప్పకుండా హిట్ పడుతుందనే నమ్మకంతో కల్యాణ్ రామ్ వున్నాడు. 

More Telugu News