Sridevi: ఇప్పుడు ఆ పాట పాడాలనిపించడం లేదు : ప్రముఖ గాయని సుశీల

  • హోటల్ హయత్ లో నటి శ్రీదేవి సంస్మరణ సభ
  • ‘బూచాడమ్మ బూచాడు..’ పాటను ఇప్పుడు నేను పాడలేను
  • సీనియర్ గాయని పి.సుశీల ఆవేదన

సినీ నటి శ్రీదేవి సంస్మరణ సభ హైదరాబాద్ లోని హోటల్ హయత్ లో ఈ సాయంకాలం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ, ప్రముఖ నిర్మాత టి.సుబ్బరామిరెడ్డి - టీవీ 9 ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన సినీ నటులు, రచయితలు, నిర్మాతలు తదితరులు హాజరయ్యారు.

కాగా, నాటి 'బడిపంతులు' చిత్రంలోని ‘బూచాడమ్మ బూచాడు బుల్లిపెట్టెలో ఉన్నాడు..’ అనే పాటను చిన్నారి శ్రీదేవిపై చిత్రీకరించగా, ఆ పాటను పాడింది ప్రముఖ సీనియర్ గాయని పి.సుశీల. ఈ సందర్భంగా ఆ పాటను ఒకసారి పాడండంటూ యాంకర్ కోరగా, ‘శ్రీదేవి గుర్తుకు రాగానే ఎక్కువగా గుర్తుకొచ్చే పాట ‘బూచాడమ్మ బూచాడు..’. ఆమె చిన్నపిల్లగా ఉన్నప్పటి పాట అది’ అని సుశీల అన్నారు.

‘ఆ పాట ఓ సారి పాడతారా?’ అని ప్రశ్నించగా..‘ఇప్పుడు.. ఆ పాట పాడాలనిపించడం లేదు. కష్టంగా ఉంది.. అందరికీ చాలా బాధగా ఉంది.. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా’ అని అన్నారు. 

More Telugu News