Tripura: త్రిపుర సీఎం మాణిక్ సర్కార్ రాజీనామా

  • గవర్నర్ కు రాజీనామా లేఖ సమర్పించిన మాణిక్ సర్కార్
  • కొత్త ముఖ్యమంత్రి వచ్చే వరకూ ఆ పదవిలో కొనసాగనున్న వైనం
  • ఇన్నేళ్లుగా సహకరించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన మాణిక్ సర్కార్

త్రిపుర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిన్న వెలువడిన విషయం తెలిసిందే. సీపీఎం 16 సీట్లు గెలుచుకోగా, బీజేపీ-పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర కూటమి 43 సీట్లు సాధించడం విదితమే. ఈ నేపథ్యంలో త్రిపుర సీఎం మాణిక్ సర్కార్ తన పదవికి ఈరోజు రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ తథాగత రాయ్ కి సమర్పించారు.

కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసే వరకూ ఆ పదవిలో కొనసాగాలని మాణిక్ సర్కార్  కు గవర్నర్ సూచించారు. అనంతరం, మాణిక్ సర్కార్ మీడియాతో మాట్లాడుతూ, ఇన్నేళ్లు తమకు సహకరించిన ప్రజలు, అధికారులకు ధన్యవాదాలని, వారి సహకారం వల్లే ఇన్నేళ్ల పాటు తమ పాలన కొనసాగిందని అన్నారు.

More Telugu News