Instagram: శ్రీదేవి అభిమానులకు శిల్పాషెట్టి కానుక....ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో వైరల్

  • అతిలోకసుందరికి బాలీవుడ్ నిర్మాత కరణ్ విందు
  • ఇష్టమైన వంటకాలతో వడ్డింపు...వారితో పాటు శిల్పాశెట్టి, మనీష్ మల్హోత్రా
  • శ్రీదేవి 'మామ్' చిత్రాన్ని థియేటర్లలో చూడాలని వినతి

అతిలోకసుందరి శ్రీదేవితో కలిసి పంచుకున్న క్షణాలను వీడియో రూపంలో బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ఆ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. నిర్మాత కరణ్ జోహార్ తన మిత్రులైన శ్రీదేవి, శిల్పాశెట్టి, మనీష్ మల్హోత్రాలను తన ఇంటికి పిలిచి విందు ఏర్పాటు చేశారు. ఆ దృశ్యాలను మీరు వీడియోలో చూడొచ్చు. అమ్మ లాంటి శ్రీదేవితో కలిసి ఉన్నామని ఈ వీడియోలో వారంతా చెప్పారు.

శ్రీదేవి నటించిన 'మామ్' చిత్రం త్వరలోనే విడుదల కాబోతోందని, దానిని అందరూ థియేటర్లకు వెళ్లి చూడాలని వారు కోరారు. శ్రీదేవితో సరదాగా గడిపిన వీడియోను శిల్పా శెట్టి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. "ఈ సంతోషకరమైన ఆదివారం నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. నేను ఎప్పుడూ నిన్ను ప్రేమతో ఇదే విధంగా గుర్తు పెట్టుకుంటాను. శ్రీదేవిని ప్రేమించే వారి కోసం ఈ వీడియో" అని శిల్పాశెట్టి తన సందేశంలో పేర్కొంది.


More Telugu News