chaitu: 'సవ్యసాచి' ఫస్టులుక్ కి .. రిలీజ్ కి ముహూర్తం కుదిరింది

  • చైతూ హీరోగా 'సవ్యసాచి' 
  • కథానాయికగా నిధి అగర్వాల్ 
  • మార్చి 18న ఫస్టులుక్ 
  • జూన్14వ తేదీన సినిమా రిలీజ్  

చందూ మొండేటి దర్శకత్వంలో 'సవ్యసాచి ' చిత్రం రూపొందుతోంది. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే చాలావరకూ షూటింగును పూర్తి చేసుకుంది. మార్చి 18వ తేదీన ఈ సినిమా ఫస్టులుక్ ను .. జూన్ 14వ తేదీన సినిమాను విడుదల చేయనున్నారు.

తమిళ స్టార్ హీరో మాధవన్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తూ ఉండటంతో , చైతూ వదిన పాత్రలో భూమిక నటిస్తోంది. కీరవాణి అందించిన బాణీలు ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని అంటున్నారు. గతంలో చందూ మొండేటి .. చైతూ కాంబినేషన్లో వచ్చిన 'ప్రేమమ్' సినిమా ఘన విజయాన్ని సాధించింది. దాంతో సహజంగానే 'సవ్యసాచి'పై భారీగానే అంచనాలు వున్నాయి. ఈ సినిమా తన కెరియర్లో ప్రత్యేకమైనదిగా నిలుస్తుందని చైతూ భావిస్తున్నాడు. ఇక నిధి అగర్వాల్ కి ఈ సినిమా ఎంతవరకూ కలిసొస్తుందో చూడాలి.       

More Telugu News