maoists: మరోసారి కాల్పులతో దద్దరిల్లుతున్న కోడిపుంజుల గుట్ట!

  • కోడిపుంజుల గుట్టలో నిన్న భారీ ఎన్ కౌంటర్
  • తప్పించుకున్న కొందరు మావోలు
  • నేడు మరోసారి కాల్పులతో దద్దరిల్లుతున్న గుట్టలు

భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలోని చర్ల-వెంకటాపురం మండలాల సరిహద్దులో గల కోడిపుంజుల గుట్ట మరోసారి కాల్పులతో దద్దరిల్లుతోంది. నిన్న భారీ ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతానికి కొద్ది దూరంలో మళ్లీ కాల్పులు జరుగుతున్నాయి. నిన్నటి ఎన్ కౌంటర్ లో కొంత మంది మావోయిస్టులు తప్పించుకున్నారు. దీంతో, ఆ గుట్టల్లోనే మావోలు ఉన్నారన్న అనుమానంతో భారీ ఎత్తున బలగాలు కూంబింగ్ చేపట్టాయి.

ఈ నేపథ్యంలో, పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు జరుగుతున్నాయి. ఆ గుట్టలున్న ప్రాంతానికి అటువైపు నుంచి చత్తీస్ ఘడ్ పోలీసులు, ఇటువైపు నుంచి తెలంగాణ పోలీసులు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. దీంతో, అక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది. 

More Telugu News