Chittoor District: కుదువపెట్టిన నగలతో జూదమాడిన ముత్తూట్ ఫైనాన్స్ బ్రాంచ్ మేనేజర్

  • వి.కోట ముత్తూట్ ఫైనాన్స్ లో బ్రాంచ్ మేనేజర్ ప్రకాశ్
  • వినియోగదారుల 2 కేజీల బంగారు నగలను ష్యూరిటీగా పెట్టి క్రికెట్ బెట్టింగ్
  • ఓడిపోవడంతో బంగారం స్థానంలో నకిలీ నగలు

కుదువపెట్టిన నగలను జాగ్రత్తగా భద్రపరచాల్సిన బ్రాంచ్ మేనేజర్ వాటితో జూదమాడి, పోగొట్టుకుని, వాటి స్థానంలో నకిలీ నగలను పెట్టిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే... చిత్తూరు జిల్లా వి.కోట ముత్తూట్‌ ఫైనాన్స్‌ బ్రాంచ్ మేనేజర్‌ గా పని చేస్తున్న ప్రకాశ్ కు క్రికెట్ బెట్టింగ్ వ్యసనం ఉంది.

ఈ నేపథ్యంలో ఆయన తన బ్రాంచ్ లో వినియోగదారులు కుదువ పెట్టిన 2 కేజీల నగలను బెట్టింగ్ లో ష్యూరిటీగా పెట్టాడు. బెట్టింగ్ లో ఓడిపోవడంతో ఆ నగల స్థానంలో గుట్టుచప్పుడు కాకుండా నకిలీ బంగారు నగలను పెట్టాడు. ఇది వెలుగు చూడడంతో మనస్తాపం చెందిన ఆయన ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

More Telugu News