sardhul thakur: ముంబై లోకల్ ట్రైన్ లో క్రికెటర్... గూగుల్ ని ఆశ్రయించి నిర్ధారించుకున్న ప్రయాణికులు

  • అంధేరీలో లోకల్ ట్రైన్ ఎక్కిన శార్ధుల్ ఠాకూర్
  • టీమిండియా క్రికెటరేనా? అని గూగుల్ లో చూసుకున్న ప్రయాణికులు
  • సెల్ఫీలు, ఫొటోలతో సందడి

టీమిండియా క్రికెటర్ శార్థుల్ ఠాకూర్ ముంబైలోని లోకల్ ట్రైన్ లో ప్రయాణించి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. సౌతాఫ్రికా టూర్ నుంచి ఎమిరేట్స్ ఫ్లైట్ లో ముంబై చేరిన శార్థుల్ అంధేరీ రైల్వేస్టేషన్ లో లోకల్ ట్రైన్ టికెట్ కొనుక్కుని ప్రయాణించాడు. ట్రైన్ లో శార్థుల్ ని చూసి గుర్తుపట్టిన పలువురు ప్రయాణికులు, టీమిండియా క్రికెటర్, అందునా తాజాగా జరిగిన సౌతాఫ్రికా టూర్ కి వెళ్లి వచ్చిన క్రికెటర్ లోకల్ ట్రైన్ లో ఎందుకు వస్తాడు? అని భావించి సందిగ్ధంలో పడ్డారు.

కొందరు యువకులు మాత్రం గూగుల్ ని ఆశ్రయించి, ట్రైన్ లో తమతో ప్రయాణిస్తున్నది శార్ధుల్ ఠాకూరేనని రూఢీ చేసుకుని, అతనితో సెల్ఫీలు, ఫొటోలు దిగారు. అందరితోనూ నవ్వుతూ మాట్లాడి, తన స్టేషన్ రాగానే అందరికీ బై చెప్పి వెళ్లిపోయాడు. కాగా, ఈ ఏడాది ఐపీఎల్ లో శార్థుల్ ను చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకుంది. 

More Telugu News