Jana Reddy: కేటీఆర్ సంస్కారం గురించి కాంగ్రెస్ నేతలు మాట్లాడటం విడ్డూరంగా ఉంది: మంత్రి జగదీష్

  • కేటీఆర్ పార్లమెంటరీ పద్ధతిలోనే మాట్లాడారు
  • జానారెడ్డికి కాంగ్రెస్ నేతలు ఇవ్వని గౌరవాన్ని కేసీఆర్ ఇచ్చారు
  • మోదీపై కేసీఆర్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు

కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిని ఉద్దేశించి మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఓ బహిరంగసభలో కాంగ్రెస్ నేతలు చేపట్టిన యాత్రను ఉద్దేశించి మాట్లాడుతూ, కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో మరో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ, పార్లమెంటరీ పద్ధతిలోనే కేటీఆర్ మాట్లాడారని చెప్పారు.

సంస్కారం గురించి కాంగ్రెస్ నేతలు మాట్లాడటం విడ్డూరంగా ఉందని అన్నారు. జానారెడ్డికి కాంగ్రెస్ నేతలు కూడా ఇవ్వని గౌరవాన్ని కేసీఆర్ ఇచ్చారని తెలిపారు. ప్రధాని మోదీపై ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఎలాంటి పరుష వ్యాఖ్యలు చేయలేదని అన్నారు. బీజేపీ నేతలు ఈ అంశంపై లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు.

More Telugu News