Sridevi: శ్రీదేవి కోసం అందరూ పుట్టెడు బాధతో వస్తే... నవ్వుతూ గడిపిన హీరోయిన్... నెటిజన్ల తిట్లు!

  • రెండు రోజుల క్రితం శ్రీదేవి అంత్యక్రియలు
  • బాధతో వీడ్కోలు పలికిన లక్షలాది మంది
  • నవ్వుతూ కనిపించిన జాక్వలిన్ ఫెర్నాండెజ్
  • ఆమె వైఖరిపై విమర్శల వెల్లువ

భారత అందాల నటి శ్రీదేవి అకాల మరణం ఎంతో మందిని కదిలించగా, రెండు రోజుల క్రితం జరిగిన ఆమె అంత్యక్రియల్లో లక్షలాది మంది అభిమానులతో పాటు వివిధ భాషల చిత్ర ప్రముఖులు హాజరై, ఆమెకు బాధాతప్త హృదయాలతో కడసారి వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఇక ప్రతి ఒక్కరూ పుట్టెడు బాధతో ఉన్న వేళ, హీరోయిన్ జాక్వలిన్ ఫెర్నాండెజ్ నవ్వుతూ కనిపించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ కాగా, పలువురు ఆమె వైఖరిని తప్పుపడుతున్నారు.

ఏదో మూవీ ఫంక్షన్ కు వచ్చినట్టు కనిపించిన జాక్వలిన్, తనకు తారసపడ్డ వారందరినీ నవ్వుతూనే పలకరించిందట. ఈ ఫొటోలను పోస్టు చేస్తూ, అందరూ బాధతో వస్తే, జాక్వలిన్ పబ్లిసిటీ కోసం వచ్చిందని విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అవార్డు షోకు వచ్చినట్టుగా జాక్వలిన్ వైఖరి ఉందని, ఆమె ముఖంలో బాధ ఎంతమాత్రమూ కనిపించలేదని కూడా నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

More Telugu News